బషీరాబాద్: మండలంలోని పర్వత్ పల్లి గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులను టీఆర్ఎస్ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు. దేవాలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.